ఫిర్యాదు చేసిన వర్సిటీ అధికారులు
విద్యార్థుల ఫోన్ల నుంచి వాట్సాప్ గ్రూపుల తొలగింపు
కమాన్చౌరస్తా, ఆగస్టు 21: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని వర్సిటీ అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈక్రమంలో శనివారం యూనివర్సి టీ అధికారులు కొత్తపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేసినట్లు తెలిసింది. ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపులద్వారా బయటకు రాగా, ఎస్సారార్ కళాశాల ప్రాంగణలో పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థుల సెల్ఫోన్లను పరీక్ష నిర్వహణ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటిని పోలీసు అధికారులకు అప్పగించి, సైబర్ పోలీసులతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని తెలిపినట్లు సమాచారం.
వాట్సప్ గ్రూపుల తొలగింపు..!
ప్రశ్నాపత్రం లీకైన తర్వాత శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు తొమ్మిది మంది విద్యార్థుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లీకేజీలో భాగస్వాములవుతారనుకున్న కళాశాలకు చెందిన యాజమాన్యం మిగతా విద్యార్థుల సెల్ఫోన్ల నుంచి వాట్సాప్ గ్రూపులను డిలీట్ చేయించినట్లు సమాచారం. అయితే, ఎస్సారార్ కళాశాల ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు పలువురి విద్యార్థుల సెల్ఫోన్లు అధికారులు స్వాధీనం చేసుకోగా, మధ్యాహ్న సమయంలో మరికొన్ని ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా విద్యార్థులకు వచ్చినట్లు తెలిసింది.
క్వశ్చన్ పేపర్ లీక్పై ఫిర్యాదు
రాంనగర్, ఆగస్టు 21: డిగ్రీ ఆరో సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీకైన ఘటనలో యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సారార్ కళాశాలలో మాస్ కాఫీయింగ్కు పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేయగా అరగంట ముందే క్వశ్చన్ పేపర్ విద్యార్థుల వాట్సాప్లలో చక్కర్లు కొట్టడంపై లీకేజీ వ్యవహారం బయట పడింది. దీనిపై విచారణ చేపట్టిన శాతవాహన యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల మొబైళ్లను స్వాధీ నం చేసుకుని విచారణ జరిపి నివేదిక సమర్పించారు. అనంతరం దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఫోన్లు, ఫోన్ నంబర్లను పోలీసులకు అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ లక్ష్మీబాబు తెలిపారు.