“కరీంనగర్ జిల్లాలో పలు రంగుల్లో లభ్యమయ్యే గ్రానైట్కు అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉన్నది. సమాజంలో పరిశ్రమలతో ప్రగతి సాధ్యమవుతుంది. పరిశ్రమల్లో వ్యర్థాల నిల్వ ప్రాంతాల్లో అసోసియేషన్ మొక్కల పెంపకం చేపట్టడం అభినందనీయం. ఏ జిల్లా అయినా ఒకే రంగానికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ, మన జిల్లాలో నీటి వ్యవస్థతోపాటు పారిశ్రామికంగా రైస్మిల్లులు, గ్రానైట్ ఉండడం ఇక్కడి గొప్పతనం” అని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్తపల్లి మండలం ఎలగందులలోని ‘కరీంనగర్ డిస్ట్రిక్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో అసోసియేషన్ భవనంలో మంగళవారం నిర్వహించిన ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి హాజరయ్యారు.
ముకరంపుర, జూన్ 6: వివిధ రంగుల్లో లభ్యమయ్యే కరీంనగర్ గ్రానైట్కు అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కొత్తపల్లి మండలం ఎలగందులలోని ‘కరీంనగర్ డిస్ట్రిక్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో అసోసియేషన్ భవనంలో మంగళవారం నిర్వహించిన ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు గ్రానైట్ పరిశ్రమల యజమానులను సన్మానించి ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందించారు. సన్మానం పొందిన వారిలో స్థానికంగా మొదట గ్రానైట్ పరిశ్రమ ఏర్పాడు చేసిన కుమార్ను అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు.
పదేళ్ల క్రితం నాటికి ఇప్పటికి గ్రానైట్ ఇండస్ట్రీ గొప్ప అభివృద్ధి సాధించిందన్నారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కేవలం బ్లాక్ గ్రానైట్ మాత్రమే లభ్యమవుతుండగా, మన జిల్లాలో అందుకు భిన్నంగా పలు రంగుల్లో లభ్యమవుతున్నదని తెలిపారు. ఇండస్ట్రీల నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణకు చేస్తున్న కృషి బాగుందని ప్రశంసించారు. మన దగ్గర నదీ ఇసుక లభ్యమవుతున్నట్లుగా ఇతర రాష్ర్టాల్లో లేదని, చిన్నచిన్న రాళ్లతో రోబో సాండ్ తయారీపై అసోసియేషన్ దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్లో ప్రస్తుతం 80 నుంచి 90 శాతం వరకు రోబో సాండ్ వినియోగిస్తున్నారని చెప్పారు. సమావేశంలో విజిలెన్స్ ఎస్పీ రామారావు, మైనింగ్ ఏడీ సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్ఈ వీ గంగాధర్, డీఈ రాజం, ఏడీఈ రాజు, ఏఈ లక్ష్మీనారాయణ, ఇండస్ట్రీస్ ప్రమోషనల్ అధికారి మధులత, గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగుల ప్రదీప్, ట్రెజరర్ జిల్లా అశోక్కుమార్, ఉపాధ్యక్షుడు సీహెచ్ కిరణ్కుమార్, పీ జగన్మోహన్రావు, జాయింట్ సెక్రటరీలు కే సతీశ్కుమార్, కడారి శ్రీనివాస్, వేణుగోపాల్, సభ్యులు, పరిశ్రమల యజమానులు ఉన్నారు.
దేశంలోనే పెద్ద పరిశ్రమ
గ్రానైట్ పరిశ్రమ జిల్లాలో 2002లో ప్రారంభమై దేశంలోనే పెద్ద పరిశ్రమగా ఏర్పడింది. గతంతో పోల్చితే పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, కట్టర్స్తో 400 పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా 15 వేల నుంచి 20 వేల మంది, క్వారీల ద్వారా సుమారు 60 వేల మంది ఉపాధి పొందుతున్నారు. సింగరేణి తర్వాత గ్రానైట్ అతి పెద్ద పరిశ్రమగా విస్తరించింది. త్వరలోనే రోబోసాండ్, ఇటుకల తయారు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నాం. ఎక్కడా లేని విధంగా అసోసియేషన్కు అన్ని వసతులు, సౌకర్యాలతో సొంత భవనం ఉన్నది. గతంలో ఆసిఫ్నగర్లో ఒకే ఒక్క సబ్స్టేషన్ ఉండగా, పెరిగిన విద్యుత్ అవసరాల మేరకు ఖాజీపూర్, ఆచంపల్లి, ఖాజీపూర్, ఒద్యారంలో సబ్స్టేషన్లు ఏర్పాటయ్యాయి. మరో రెండు సబ్స్టేషన్లు నిర్మించాల్సి ఉన్నది. ప్రతి నెలా సుమారు రూ.15 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం. కొవిడ్ తర్వాత పరిశ్రమ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. 8 ఎకరాల్లో పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను నిల్వ చేస్తున్నాం. ఆ ప్రాంతంలో మొక్కల పెంపకం చేపట్టాం. ప్రతి సామాజిక కార్యక్రమంలోనూ ముందుంటున్నాం. స్థానికంగా 50 పడకల దవాఖానకు భూమి మంజూరు చేసిన కలెక్టర్కు కృతజ్ఞతలు.
– పీ శంకర్, గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
పరిశ్రమలతోనే జిల్లాలో ప్రగతి
పరిశ్రమల ఏర్పాటు ద్వారానే ప్రగతి సాధ్యమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపా రు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. దళితబంధు ద్వారా దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దుతున్నట్లు చె ప్పారు. దళితబంధు పథకానికి జిల్లాకు రూ.2వేల కోట్లను మంజూరు చేసిందన్నారు. జిల్లా ఆవిర్భావానికి ముందు తర్వాత పరిశీలిస్తే పరిశ్రమలు స్థాపనలో చాలా అభివృద్ధిని సాధించినట్లు చెప్పారు.
దళితబంధు పథకం ద్వారా వెయ్యి మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, ఆర్థిక అభివృద్ధి సాధించారని వివరించారు. ఈపథకం అమలుపై అనుమానాలను రేకెత్తించిన వా రి ముందే విజయవంతంగా అమలు చేసి, లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేసినట్లు తెలిపారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన సులభతరమైందన్నారు. ఈసందర్భంగా పలు రంగాలకు చెందిన పరిశ్రమల నిర్వాహకులను కలెక్టర్ సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఇక్కడ స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాట్సల్ టో ప్పో, జడ్పీ సీఈవో ప్రియాంక, కార్మిక శాఖ ఉప కమిషనర్ రమేశ్బాబు, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరావు పాల్గొన్నారు.