కార్పొరేషన్, జనవరి 10: కరీంనగర్లో సకల సౌకర్యాలతో ఆరు సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇందులో పరిశుభ్రమైన వాతావరణంలో క్రయ విక్రయాలు సాగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ కర్ణన్తో కలిసి సోమవారం మంత్రి నగరంలో పర్యటించారు. రెండో డివిజన్ పరిధిలోని విద్యారణ్యపురిలో రూ.56 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, రూ.1.30 కోట్లతో మంచినీటి పైపులైన్, రూ. 76 లక్షలతో ఎస్డబ్ల్యూజీ పైపులైన్, సీసీ రోడ్డు పనులు, రూ.2 కోట్లతో తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ నుంచి గోపాల్పూర్ వెళ్లే రోడ్డు పనులకు పూజ చేశారు. అనంతరం మొకలు నాటారు. వ్యవసాయ మారెట్ యార్డులో రూ.5.80 కోట్లతో జీ+1 పద్ధతిలో నిర్మించనున్న సమీకృత మారెట్ పనులను ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడారు. నగర ప్రజలకు పరిశుభ్రమైన కూరగాయలు, మాంసం, పండ్లు అందించాలనే ఉద్దేశంతో సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో 146 (76 వెజిటేబుల్, 30 నాన్వెజ్, 40 ప్లవర్స్, ఫ్రూట్స్) స్టాళ్లు ఉంటాయన్నారు.
లిఫ్ట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రూ. 60 లక్షలతో మార్కెట్లో పొగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి బయో మైనింగ్కు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కలెక్టర్ క్యాంపు ఆఫీసు ఎదుట ఉన్న ఇరిగేషన్ శాఖ ఆఫీసు వద్ద రూ. 14 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. పద్మనగర్లోని పశుసంవర్ధక శాఖ స్థలం, గిద్దె పెరుమాడ్ల టెంపుల్ స్థలంలో, కశ్మీర్గడ్డ రైతుబజార్లో సమీకృత మార్కెట్లు నిర్మిస్తామన్నారు. శివారు డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అంబేద్కర్నగర్ రిజర్వాయర్ నుంచి తీగలగుట్టపల్లిలోని పలు ప్రాంతాలకు తాగునీరందిస్తామని పేర్కొన్నారు. టవర్ సరిల్లో పారింగ్ కోసం ఆర్ అండ్ బీ స్థలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణ ప్రగతి, సీఏం అస్యూరెన్స్, డీఎంఏఫ్టీ నిధులతో నగరాన్ని సుందరీకరిస్తామని చెప్పారు. రోడ్లపై కూరగాయలు విక్రయించేవారికి మార్కెట్లలో స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడతామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
అతి త్వరలో రివర్ ఫ్రంట్ పనులు..
కరీంనగర్కు తలమానికమైన మానేరు రివర్ ఫ్రంట్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. మంగళవారం ఇరిగేషన్ ఈఎన్సీ, ఇతర ఉన్నతాధికారులు, ఐఎన్ఐ కన్సెల్టెన్సీ బృందంతో రివర్ ఫ్రంట్ స్థలాన్ని పరిశీలిస్తామ న్నారు. తదనంతరం టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 410 కోట్లను మంజూరు చేసిందన్నారు. వచ్చే జూన్ 2లోగా కేబుల్ బ్రిడ్జ్ను కూడా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ పనులు పూర్తయితే కరీంనగర్కు పర్యాటక శోభ వస్తుందన్నారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ సేవా ఎస్లావాత్, ఏఎంసీ చైర్మన్ ఎలుక అనిత, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కాశెట్టి లావణ్యా శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్, మెండి శ్రీలతా చంద్రశేఖర్ ఉన్నారు.
బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన..
జడ్పీ రోడ్డు నగునూర్ నుంచి రాణీపూర్ వయా తీగలగుట్టపల్లి వరకు 3.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రాణీపూర్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. సుమారు రూ 2కోట్ల15 లక్షలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నదని, ఇది పూర్తయితే కొత్తపల్లి నుంచి తీగలగుట్టపల్లి వరకు తక్కువ సమయంలో చేరుకోవచ్చన్నారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కమిషనర్ వేణుమాధవ్, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, కౌన్సిలర్లు జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్, గున్నాల రమేశ్, గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఫక్రొద్దీన్, చెట్టిపల్లి ప్రభాకర్, నాయకులు బండ గోపాల్రెడ్డి, ఎస్కే బాబా, స్వర్గం నర్సయ్య, తుమ్మ ప్రతాప్ రెడ్డి, వేముల శేఖర్, కట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.