సిరిసిల్ల రూరల్, జనవరి 13: తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లో ఈనెల 16 నుంచి పరిశ్రమలు తెరుచుకోనున్నాయి. ఈ నెల ఒకటి నుంచి టెక్స్టైల్ రంగం సంక్షోభంతోపాటు ప్రభుత్వ ఆర్డర్లు రాకపోవడంతో నిరవధిక బంద్ పాటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం దిగివచ్చి యథావిధి గా టెక్స్టైల్ పార్క్కు రాజీవ్ విద్యామిషన్ ఆర్డర్లు అందిస్తూ ఉత్తర్వుల జారీ చేసింది.
దీంతో ఈ నెల 16 నుంచి టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమల ను యథావిధిగా ప్రారంభిస్తామని టెక్స్టైల్ పా ర్క్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్వీఎం ఆర్డర్లు అందించిన చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జౌళీశాఖ డైరెక్టర్ అలుగు వర్షిణికి పార్క్ అసోసియేషన్ సభ్యులు,యజమానులు కృతజ్ఞతలు తెలిపారు.