కమాన్ చౌరస్తా, నవంబరు 26: కరీంనగర్లోని సాలెహ్నగర్ ట్రినిటీ విద్యాసంస్థల బ్రాంచ్లో ట్రినిటీ కళోత్సవ్ -2022 జోరుగా హుషారుగా సాగింది. అతిథులుగా అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్లాల్, డీఐఈవో రాజ్యలక్ష్మి, విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మ నోహర్రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంతరెడ్డి జ్యోతి ప్ర జ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావు విద్యార్థులకు సందేశమిచ్చారు.
జబర్దస్త్ ఫేం హై పర్ ఆది టీం ప్రదర్శనలు, గాయని యామిని బృందం పాటలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. విద్యార్థులు నృత్యాలతో ఆకట్టుకున్నా రు. కార్యక్రమంలో డీన్ మ నోహర్, ప్రిన్సిపాళ్లు రమణారెడ్డి, పవనకుమార్, సుధాకరరెడ్డి, ఆనందరెడ్డి, జనార్దన్రెడ్డి, వెంకటరెడ్డి, గోగుల ఈవెంట్స్ నిర్వాహకులు గోగుల ప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.