కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 10: ఆధార్ కార్డుల్లో త ప్పుల సవరణకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. నిబంధనల పేరిట కేంద్రం, నిర్వాహకులు కొర్రీలు పెడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి సెంటర్ల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి పోతున్నారు. అయినా ఫలితముండకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వివిధ పథకాలు, రిజిస్ట్రేషన్లు ఇతరత్రా దరఖాస్తు చేసుకొనేది ఏలా ఇని వాపోతున్నారు.
బ్యాంకు ఖాతా తీయాలన్నా, ఓటు నమో దు చేసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు పెట్టాలన్నా ఆధార్కార్డు తప్పనిసరి. అయితే చాలామందికి సంబంధించిన ఆధార్ కార్డుల్లో తప్పులు దొర్లాయి. దీంతో అప్పటి నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతూ నెట్టుకొన్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వం ఆధార్లో తప్పుల సవరణకు సర్కారు హయాంలో 29, ప్రైవేట్ వ్యక్తులు, వివిధ బ్యాంకుల్లో 65 మొ త్తంగా 90 సెంటర్లను ఏర్పాటు చేశారు. నిత్యం ఎందరోమంది ప్రజలు తప్పుల సవరణకు ఈ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే కొత్త ని బంధనలతో తలనొప్పులు పడుతున్నారు. ఆ ధార్లో అడ్రస్, ఫొటో, సంతకం, పేరు మార్పిడికి గెజిటెడ్స్థాయి అటెస్టేషన్ పొందిన పత్రాలు జత చేయాలని సూచిస్తున్నారు. దీంతో సామాన్యులు గెజిటేడ్ ఆఫీసర్ సంతకం కోసం కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగివేసారి పోతున్నారు. నెలలు గడుస్తున్నా త ప్పుల సవరణకు నోచుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా అవకాశాలను కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా నిబంధనలను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్వాహకులకు కత్తిమీద సామే..
మరోవైపు ఆధార్ సెంటర్ల నిర్వాహకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజ లు అందజేసే తప్పుల సవరణ విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే వారు బాధ్యులవుతున్నారు. నెలలో 30 తప్పులు గుర్తిస్తే ఆధార్ నిర్వాహకులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ప్ర జలు అందజేసే దరఖాస్తులో దిద్దుబాట్లు, కొట్టివేతలు, నిర్దేశిత స్థలంలో కాకుండా సంతకం, ఫొటో, ఇతర వివరాలు సక్రమంగా లేకపోయి నా తప్పులుగా నమోదవుతున్నాయి. ఇవన్నీ నిర్వాహకులు చేసే పనులు కాకపోయినా వాటి ని అప్లోడ్ చేసేది వారే కాబట్టి ముందుగా సక్రమంగా పరిశీలించాకే అప్లోడ్ చేయాలనే కారణంతో ఇలాంటి ఆంక్షలను తెరమీదకు తెచ్చా రు. ఫొటోలు తప్పుగా ఉన్నా, సమాచారం, భాష విషయంలోనూ పొరపాట్లు జరిగినా భారీగా జరిమానా విధిస్తూ, సంబంధిత ఆధార్ సెంటర్ ఐడీని ఏడాదిపాటు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లు సక్రమంగా అప్లోడ్ చేయకపోయినా, ఫొటో తీసుకోవడంలో తప్పు చేసినా ఆధార్ నిర్వాహకులదే బాధ్యతగా పే ర్కొనడంతో ఇటు ప్రజలు, అటు అధికారుల ఆ గ్రహానికి గురికావాల్సి వస్తున్నదని వాపోతున్నారు. సెంటర్ల వద్ద నిత్యం ప్రజలు, నిర్వాహకుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
సంతకాలు చేయడం లేదు..
మేం తక్కళ్లపల్లి నుంచి వచ్చి కరీంనగర్లోని లక్ష్మీనగర్లో కిరాయికి ఉంటున్నాం. కూ లీనాలో చేసుకుంటూ బ తుకుతాం. ఇటీవల ఆ ధార్ కార్డులో అడ్రస్ మార్పిడి కో సం వెళ్తే గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరణ కావాలని చెప్పారు. కానీ అధికారులు, సార్ల వద్దకు వెళ్తే ఎవరూ సంతకాలు చేయడంలేదు. దీంతో మస్తు ఇబ్బందులు పడుతు న్నాం. అధికారులు ఇసొంటి రూల్స్ను తీసేయాలి.
– రవీందర్, లక్ష్మీనగర్, కరీంనగర్
వయసు తప్పు పడ్డది..
ఆధార్ కార్డు రిజి స్టర్ చేసుకునే సమ యంలో వయసు త ప్పుగా నమోదు చేశా రు. దీంతో నాకు పిం ఛన్ రావడం లేదు. నా కన్నా చిన్న వారికి పెన్షన్ వస్తుంది. వయస్సు మార్చాలని ఆ ధార్ కేంద్రానికి వెళ్లిన వయస్సుకు సం బంధించి ధ్రువీకరణ అడుగుతున్నారు. నేను ఏమీ చదువుకోలేదు. ఎట్లా తేవాలో అర్థం కావడంలేదు.
– వొద్దమల రాజయ్య, కరీంనగర్.