రాయికల్, డిసెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాలను జిల్లాగా చేసి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేసిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. రాయికల్ మున్సిపల్ కౌన్సిలర్ కాంతారావు ఆధ్వర్యంలో యూత్ నాయకుడు రాజేశ్, రాయికల్ పట్టణానికి చెందిన 40 మంది యువకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాయికల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు రూ.2 కోట్ల నిధులు కేటాయించామన్నారు. రాయికల్ పట్టణంలో 1600 మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాయికల్ పెద్ద చెరువును ఎస్సారెస్పీ నీటితో నింపి వేసవిలోనూ మత్తడి పారేలా చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, నాయకులు సురేశ్, రాజేందర్ పాల్గొన్నారు.
మైతాపూర్ బ్రిడ్జికి రూ.2.90 కోట్లు, రామాజీపేట బ్రిడ్జికి రూ.1.40 కోట్లు
రాయికల్ మండలంలోని మైతాపూర్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.90 కోట్లు, రామాజీపేట హైలెవల్ బ్రిడ్జికి రూ.1.40 కోట్ల చొప్పున ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.