విద్యానగర్, డిసెంబర్ 21: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్) సిబ్బందికి హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం దేశంలో మొదటిసారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు కొనియాడారు. దీని ద్వారా రాష్ట్రంలోని 4 వేల మంది ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. ప్యాక్స్ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యూనిఫాం హెచ్ఆర్ పాలసీకి ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా, బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కేడీసీసీబీ ఆవరణలో సంబురాలు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, నాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాగా, కార్యక్రమంలో కొండూరి పాల్గొని మాట్లాడారు. రైతులకు అనుసంధానంగా పనిచేస్తున్న ప్యాక్స్ చైర్మన్లకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచడంతోపాటు ఉన్నతంగా పని చేసే సహకార సొసైటీల చైర్మన్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్తోపాటు మంత్రి నిరంజన్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు పింగిళి రమేశ్, సీఈవో సత్యనారాయణ రావు, డైరెక్టర్లు సింగిరెడ్డి స్వామిరెడ్డి, రాజిరెడ్డి, రాంచందర్రావు, రమేశ్, గోపాల్ రావు, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ శంకర్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ కుమారస్వామి, కార్యదర్శి ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మధు, జగిత్యాల అధ్యక్షుడు జీ వేణు, ప్రధాన కార్యదర్శి టీ ఉపేందర్, వైస్ చైర్మన్ పీ రమేశ్, డైరెక్టర్లు, సీఈవో ఎన్ సత్యనారాయణరావు, నాబార్డు డీడీఎం పీ అనంత్, ప్యాక్స్ చైర్మన్లు, సీఈవోలు, తదితరులు పాల్గొన్నారు.