గంగాధర, జనవరి 3: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి మండల విద్యాధికారి అంబటి వేణుకుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ, అంధకార భారతావనిలో మెరిసిన వేగుచుక్క సావిత్రీబాయి ఫూలే అని కొనియాడారు. ఆమె బాలికా విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, తిరుపతిరావు, ప్రవీణ్కుమార్, ఆర్వీలు రవీందర్, చంద్రమౌళి, శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, జనవరి 3: ఆణగారిన వర్గాల ప్రజలకు విద్యనందించిన చదువుల తల్లి సావిత్రీబాయి ఫూలే ఆశయాలను కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు కనకయ్య, ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ పేర్కొన్నారు. నగరంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో ఫూలే చిత్రపటానికి వారు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, సావిత్రీ బాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రవికుమార్గౌడ్, సంజీవ్, రాకేశ్చారి, తిరుపతి పాల్గొన్నారు. అలాగే, నగరంలోని తెలంగాణ చౌక్లో సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, మహిళా జోనల్ కన్వీనర్ స్వరూప పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో మహిళలను విద్యావంతులను చేసిన మహానీయురాలు సావిత్రీ బాయి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు మధు, హేమంత్, వినయ్, రాజు పాల్గొన్నారు. నగరంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి సంఘం జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్, సాగర్, సందీప్, సన్ని పాల్గొన్నారు. నగరంలోని రిషి కాన్వెంట్ పాఠశాలలో సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్ పటేల్, అశ్విన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కోర్టుచౌరస్తా, జనవరి 3: జిల్లా కోర్టులో ఫూలే చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, న్యాయవాదులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగ అభివృద్ధికి ఆమె చేసిన సేవలను కొనియాడారు.
చొప్పదండి, జనవరి 3: మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సావిత్రీ బాయి ఫూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నాయకులు మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్, ఉద్యోగులు బిజిలి కనకయ్య, మాచర్ల హన్మంతు, కడారి రాజలింగం, లచ్చయ్య, పెద్దెల్లి శేఖర్, సదానందం, హరీశ్, ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్, అరవింద్, శశికుమార్, చోటు, శ్యాం, శ్రీనివాస్, అనిల్, సంపత్, రామారావు, కార్తీక్, రిషి తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని వీణాధరి పాఠశాలలో ఫూలే చిత్రపటానికి కరస్పాండెంట్ తిప్పర్తి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొక్కుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, కే శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లేశం, పరుశరాం, సుప్రియ, సువర్ణ, సరిత, స్వప్న, లాశ్రిత, సాహితి, సంతోష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల కళాశాలలో ఫూలే చిత్రపటానికి అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా అధ్యాపకులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వాతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ సంబోజి శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జనవరి 3: నగునూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఫూలే చిత్రపటానికి ప్రిన్సిపాల్ శ్రీహరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ సమత, సిబ్బంది మోహన్రావు, రోజా రమణి, సుష్మ, లావణ్య, కవిత, ఉమాదేవి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, జనవరి 3: జిల్లా కేంద్రంలోనికలెక్టరేట్లో ఫూలే చిత్రపటానికి అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సంఘం నాయకుడు లకావత్ ప్రేమ్సింగ్, జిల్లా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాందాస్ నాయక్, నరేందర్, కృష్ణారెడ్డి, మహెందర్, తగరం రాములు, మాదాసు ప్రవీణ్, లంకదాసరి వెంకటేశ్, విజయభాస్కర్, ఆకారపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, జనవరి 3: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మంగళవారం సావిత్రీ బాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రీ బాయి ఫూలే చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు సరిత, నాగభూషణం, రాజమల్లయ్య, కవిత, పాఠకులు పాల్గొన్నారు. స్థానిక మానేరు పాఠశాలలో ఫూలే చిత్రపటానికి డైరెక్టర్ కడారి సునీతారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి సావిత్రీ బాయి ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చింతకుంటలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రీ బాయి ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్, సర్పంచ్ మంజుల, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఘనంగా సావిత్రీబాయి ఫూలే జయంతి
కమాన్చౌరస్తా, జనవరి 3: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సావిత్రీ బాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాలలో ఎంసెట్ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ‘ప్రశ్నల నిధి’ పుస్తకాలను ప్రిన్సిపాల్ రవీందర్రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి కళాశాలకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకుడు రాంమోహన్, ఎన్ఎస్ఎస్ పీవో పూజ, మాధవిలత, రఖీబ్, కరుణాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.