ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు
మల్యాల, మే 25: అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం బుధవారం ముగిసింది. ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్రప్రసాద్ ఆలయంలోని అళ్వార్ మండలంలో ఉత్సవమూర్తికి పంచామృతాలతో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్కు చెందిన బోగ శ్రీనివాస్, మల్యాలలోని మఠాంజనేయస్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు మిట్టపల్లి లక్ష్మీనారాయణ నేతృత్వంలో భజన మండలి సభ్యులు 11సార్లు హనుమాన్ చాలీసాను పఠించారు.
కార్యక్రమంలో ఈవో టంకశాల వెంకటేశ్, పాలకమండలి చైర్మన్ మారుతీస్వామి, టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు దావ సురేశ్, జడ్పీటీసీ రామ్మోహన్రావు, జాగృతి నాయకులు పసుల చరణ్, నీలగిరి రాజేందర్రావు, వెంకటేశ్వర్రావు, వొల్లాల శ్రీనివాస్గౌడ్, నాయకులు తరుణ్, అయిల్నేని కోటేశ్వర్రావు, పాలకమండలి సభ్యులు జున్ను సురేందర్ తదితరులు పాల్గొన్నారు.