గుండ్లపల్లి టూ పొత్తూరు రోడ్డుకు మహర్దశ పడుతున్నది. డబుల్ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వయా గన్నేరువరం, ఇల్లంతకుంట మండల కేంద్రాల మీదుగా రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గతంలోనే ప్రజలకు మాట ఇచ్చి చేసిన కృషితో ప్రభుత్వం 71కోట్లు మంజూరు చేసింది. మరో నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకొని వీలైనంత త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా, రెండు మండలాల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
తిమ్మాపూర్ రూరల్, జనవరి7: గుండ్లపల్లి టూ పొత్తూరు వరకు డబుల్ రోడ్డు రాబోతున్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కారు 71కోట్లు మంజూరు చే యగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కృషి ఫలించింది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి స్టేజీ నుంచి గన్నేరువరం మండల కేంద్రం, అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం పొత్తూరు దాకా 21 కిలోమీటర్ల మేర 33 ఫీట్లు తారురోడ్డు మాత్రమే ఉంది. అయితే గన్నేరువరం మండలం ఏర్పాటు కాకముందు ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు అం తగా ఉండకపోయేవి. కానీ, స్వరాష్ట్రంలో కొత్త మండలాలను ప్రకటించడంతో గన్నేరువరం మం డల కేంద్రంగా ఏర్పాటైంది. క్రమంగా ఈ ప్రాం తం అన్నింటికీ సెంటర్గా మారింది. ఇటు ఈ రో డ్డుకు నిత్యం రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫలించిన ఎమ్మెల్యే కృషి..
రాకపోకలు పెరిగిన నేపథ్యంలో డబుల్ రోడ్డు నిర్మిస్తామని ఆయా మండలాల ప్రజలకు ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ గతంలో మాట ఇచ్చా రు. అసెంబ్లీలో సైతం ఈ రోడ్డు విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరణకు హా మీ ఇచ్చింది. అయితే కాస్త ఆలస్యం కావడంతో ఈ విషయాన్ని రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు అనేక ప్రయత్నాలు చేశాయి. ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు కుట్ర పన్నాయి. కానీ, వారి పాచిక ఎక్కడా పారలేదు. ఎమ్మెల్యే రసమయి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. దీంతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం 71కోట్లు మంజూరు చేస్తూ శుక్రవారమే ఉత్తర్వు టలు జారీ చేసింది.
మరో నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి, రెండు నెలల్లోపే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం కానున్నాయి. డబుల్ రోడ్డు పూర్తయితే గన్నేరువరంలోని 16 గ్రామాలతోపా టు ఇల్లంతకుంట మండలంలోని దాదాపు సగం గ్రామాల ప్రజలకు ప్రయాణం సులువుకానుంది. దీంతో ఈ రెండు మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజూరు చేసిన సర్కారుకు రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు. త్వరలోనే పనులు ప్రారభించాలని కోరుతున్నారు.