నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు
కరీంనగర్లో తెలంగాణ డిస్ట్రిక్ట్ టీ-20 క్రికెట్ లీగ్ ప్రారంభం
కొత్తపల్లి, జూన్ 10 : తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. ఇందులో భా గంగా కరీంనగర్లో హైదరాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడుతున్నదని చెప్పారు. జిల్లా క్రికెట్ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి జగన్మోహన్రావు స్మార్థకార్థం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ డిస్ట్రిక్ట్ టీ-20 లీగ్ ను ఆయన కరీంనగర్ లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 22 వరకు వరంగల్, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్ స్టేడియాల్లో పోటీలు జరుగనుండగా రా ష్ట్రంలోని ఎనిమిది ఉమ్మడి జిల్లా జట్లు తలపడనున్నాయి. పోటీల ప్రారంభోత్సవానికి కరీంనగర్తో పాటు ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, వరంగల్, నల్గోండ, మహబూబ్నగర్ జట్లు పాల్గొన్నాయి. ఐపీఎల్ తరహా అట్టహసం గా జరిగే లీగ్కు సంబంధించిన డ్రాను కొండూరి ఆవిషరించగా థీమ్ సాంగ్ ను మేయర్ వై. సు నీల్ రావు, చాంపియన్ షిప్ ట్రోపీలను అతిథులందరూ ఆవిష్కరించారు.
అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జోగినిపల్లి జగన్మోహన్ రా వు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ని వాళులర్పించారు. ఈ సందర్భంగా కొండూరి మాట్లాడుతూ కరీంనగర్లో క్రికెట్ బతికిందంటే జగన్మోహన్రావు మూలంగానే అన్నారు. 75- 76 సంవత్సరాల్లో తాను రెండు మ్యాచ్లు అడిన సందర్భాన్ని గుర్తు చేశారు. మేయర్ సునీల్ రా వు మాట్లాడుతూ జగన్మోహన్రావు మూలంగానే కరీంనగర్లో క్రికెట్ ఆడే ఆవకాశం కలిగిందని చెప్పారు. జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు ఆగంరావు మాట్లాడుతూ క్రికెట్లో నూతన అధ్యాయానికి జగనన్న నాందిపలికారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, సంఘం బాధ్యులు మహేందర్ గౌడ్, మనోహర్రావుతో పాటు జగన్మోహన్రావు కుటుంబ సభ్యులు సీనియర్ క్రీడాకారులు, వివిధ జిల్లాల క్రికెట్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కోచ్లు, మేనేజర్లు, పాల్గొన్నారు.