యైటింక్లయిన్ కాలనీ డిసెంబర్ 19 : రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పని చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కాలనీకి వచ్చిన ఆయనకు మంగళవారం మాజీ కౌన్సిలర్ మారెల్లి రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ చౌరస్తా నుంచి 18వ డివిజన్ అల్లూరు వరకు పర్యటించారు. హనుమాన్ దేవాలయంలో పూజలు చేసి అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అల్లూరులోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించడంతోపాటు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని, గ్రామంలో మహిళా భవన్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు గుండేటి రాజేశ్, ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి, మార్క రాజు, మారెల్లి సర్వోత్తమ్రెడ్డి, ఎండీ అన్వర్, రమేశ్, చక్రపాణి, కిషన్నాయక్, లక్ష్మణ్రావు, ఫయాజ్, రేశవేని కేశవులు, గపూర్, సొప్పదండి దుర్గాప్రసాద్, చాట్ల సదానందం పాల్గొన్నారు.