కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 11: రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను శనివారం సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబసమేతంగా మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ నెల 26న తన కుమారుడు హరిహరణ్సాయి-దీక్ష వివాహ వేడుకకు హాజరు కావాలని కేసీఆర్-శోభ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. గంగుల వెంట ఆయన సతీమణి రజిత, కుమారుడితో పాటు వియ్యంకుడు డాక్టర్ ప్రదీప్కుమార్ (ఐఆర్ఎస్), ఆయన సతీమణి డాక్టర్ విజయగౌరి, తదితరులు ఉన్నారు.