జగిత్యాల రూరల్, ఏప్రిల్ 10 : తెలంగాణ స్టేట్ మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ 2024-25 సంవత్సరంలో వంద మంది మైనార్టీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నట్లు జగిత్యాల జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33.33 శాతం, శారీరక దివ్యాగులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 22 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 28న ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం 5లక్షలు ఉండాలన్నారు. అన్ని జిల్లాలకు చెందిన స్టేట్ మైనార్టీ కమ్యూనిటీల డిగ్రీ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 040-2323 6112 నంబర్లో సంప్రదించాలని సూచించారు.