పెద్దపల్లి, డిసెంబర్15: బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఓడిపోయామని అధైర్యపడవద్దని, అన్నివిధాలుగా ఉంటానని పెద్దపల్లి మాజీ ఎమ్మె ల్యే దాసరి మనోహర్రెడ్డి భరోసానిచ్చారు. పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ఈ రోజూ ఓటమి రేపుటి గెలుపునకు నాంది అని చెప్పారు.
రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రతి ఒక్కరూ వెన్నుదన్నగా నిలిచి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధు లు, నాయకులు రఘువీర్సింగ్, గంట రాములు, బొద్దుల లక్ష్మణ్, బండారి స్రవంతీ శ్రీనివాస్, ఎన్ సంపత్, బాలాజీరావు, జడల సురేందర్, రామారావు, అనంతరెడ్డి, నర్సింహరెడ్డి, మహేందర్, ఉప్పు రాజ్కుమార్, మొబిన్, శ్రీనివాస్ ఉన్నారు.