
Urea App | గంభీరావుపేట, ఆగస్టు 13 : గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని బంధించి సింగిల్ విండో కార్యాలయాని కి తాళం వేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కొత్తపల్లి సింగిల్ విండో లో 400 బస్తాల యూరియా బ్యాగ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు సందేశం అందించారు.
యాప్ టెక్నికల్ సమస్య కారణంగా ఓపెన్ కాక పోవడంతో అన్నదాతలు ముకుమ్మడిగా సింగిల్ విండో కార్యాలయం దగ్గరికి దూసుక వచ్చి ఆందోళనకు దిగారు. యాప్ లో టెక్నికల్ సమస్య ఉందని సిబ్బంది పొంతన లేని సమాచారం ఇవ్వడంతో వారిని కార్యాలయంలో బంధించి తాళం వేసి ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుంకోజి శ్రీనివాస్, గ్రామ రైతులు ఉన్నారు.