ముకరంపుర, డిసెంబర్ 29: ఆయిల్ పామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ శివారులో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆయిల్ ఫాం క్షేత్రాన్ని గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు. క్షేత్రంలో కలియదిరుగుతూ ఏపుగా పెరిగిన ఆయిల్ ఫాం మొకలను ఆసక్తిగా పరిశీలించారు. మొకల సేకరణ, నాటడంలో తీసుకున్న జాగ్రత్తలు, నీటి పారుదలతోపాటు సాగుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎకరానికి 57 చొప్పున 32 ఎకరాల్లో మొకలు నాటినట్లు క్షేత్ర నిర్వాహకులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం మొకలు ఏడాది వయసు ఉన్నాయని తెలిపారు. సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలు, మెళకువలు, ఎరువుల యాజమాన్యం, మొకల సంరక్షణ, కలుపు నివారణ, నీటి వసతి, ఇతర అంశాల గురించి తెలియజేశారు. అయితే, మొకలు ఎదిగే వరకు క్షేత్రంలో ఆయిల్ పామ్ కంటే తకువ ఎత్తులో పెరిగే రకాలకు చెందిన పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చని, దీని ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటగా రైతులు ఆయిల్ ఫాం సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో విసృ్తతంగా ప్రచారం చేయాలని, ఆయిల్ పామ్ సాగుతో వచ్చే ప్రయోజనాలు తెలియజేయాలని సూచించారు. స్వల్ప పెట్టుబడితో మంచి ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫాం సాగు విషయంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల గురించి గ్రామాల్లో ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలన్నారు. మంత్రి వెంట సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ వ్యవసాయ మారెట్ కమిటీ ఛైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, కొత్తపల్లి ఏవో రంజిత్, ఏఈవో రాజేంద్రప్రసాద్, నాయకులు శేఖర్రావు, తదితరులు ఉన్నారు.