Electricity employees | ముకరంపుర, జులై 24 : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన శుక్రవారం నాటికి 14 వ రోజుకు చేరింది.
ఈ సందర్భంగా ఉద్యోగులు ముఖానికి నల్ల రిబ్బన్లు ధరించి శాంతి యుతంగా మౌన దీక్ష చేశారు. ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మహేందర్ రావు, శ్రీనివాస్, రఘు, రాజు, సంపత్ కుమార్, యుగంధర్, సంతోష్, రంగు వెంకటనారాయణ, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.