కలెక్టరేట్, మార్చి 16: రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయం తి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పార్లమెం ట్ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ మనకు కేటాయించిన విధులను అలసత్వం వహించకుండా పూర్తి చేయాలన్నారు.
ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ అందించాలని, బాధ్యతలు, చేపట్టాల్సిన విధులపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, సీ-వీజిల్, ఎంసీఎంసీ, మీడియా సెంటర్లతో కూడిన కంప్లిట్ ఎన్కోర్ ఐటీ సెల్ను పరిశీలించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, పూజారి గౌతమి, ఆర్డీవో ఎల్ రమేశ్, ఎలక్షన్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అధికారులను కోరారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎస్పీ అఖిల్మహాజన్తో కలి సి ఎన్నికల నిర్వహణపై ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధిం చి షెడ్యూల్ వచ్చిందన్నారు. నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని తెలిపారు.
జిల్లాలో తుది ఓటరు జాబితా ప్రకారం 4 లక్షల 70వేల 634మంది ఓటర్లు, 160 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతిఒక్కరూ జాబితాలో పేర్లు సరి చూసుకోవాలన్నారు. పేరు లేని వారు ఏప్రిల్ 15వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను 1950 టోల్ఫ్రీ నంబర్ ద్వారా గానీ సీ-వీజిల్ యాప్ ద్వారా చేయవచ్చన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించేందుకు 24గంటల కాల్సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధించి వాల్రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో తొలగిస్తామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, నగదు, లిక్కర్ సరఫరా జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు ఏడు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని తెలిపారు. ప్రతి రోజు తనిఖీల్లో జప్తు చేసిన సొమ్మును జిల్లా లో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, డీపీఆర్వో వంగరి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.