Mallapur | మల్లాపూర్, జూలై 26 : మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సాంబారి శంకర్, వైస్ చైర్మన్గా చిలివేరి లక్ష్మీతో పాటు పలు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన శంకర్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ సర్పంచ్ తోపారపు వసంత, వాల్గొండ ఎస్టీ తండా సర్పంచ్ దరంసోత్ సురేందర్ నాయక్, వీడీసీ కమిటీ సభ్యులు, పంచాయతీల పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.