ప్రజల ఆరోగ్య సంరక్షణలో వైద్య సిబ్బంది సేవలు ఎనలేనివి. కరోనా మహమ్మారి కుదిపేసిన సమయంలోనూ వైద్యులతోపాటు నర్సింగ్ సిబ్బంది అందించిన సేవలు వెలకట్టలేనివి. ఇలాంటి నర్సింగ్ కోర్సుల్లో చేరిన యువతులు చదువుతోపాటే శిక్షణ పొందుతూ రోగులకు మెరుగైన సేవలందిస్తున్నారు. నర్సింగ్ విద్యపై ఆసక్తి చూపుతూ సిరిసిల్ల నర్సింగ్ కాలేజీలో ఏటా వంద మంది చేరి తమ కల నెరవేర్చుకుంటున్నారు.
వేములవాడ, డిసెంబర్ 11 : సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో ఏటా వంద మంది విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ కోర్సును అభ్యసించేందుకు చేరుతున్నారు. అందులో 50 మంది మొదటి, రెండో సంవత్సర విద్యార్థులు తమ విద్యలో భాగంగా సాధారణ వైద్య సేవలందించేందుకు వేములవాడ ఏరియా దవాఖానకు వస్తున్నారు. రోజూ ఎనిమిది గంటల పాటు రోగులకు కావాల్సిన వైద్య సేవలు అందిస్తూ శిక్షణ పొందుతున్నారు.
అయితే వెనుకబడిన రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది శాతం కోటాను అందివ్వగా, ఈ అవకాశాన్ని జమ్మూ కశ్మీర్ విద్యార్థులు నర్సింగ్ విద్యను అందిపుచ్చుకుంటున్నారు. ఏటా ఎనిమిది మంది చేరి, ఇక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకొని విద్యను అభ్యసిస్తున్నారు.
నర్సింగ్ విద్య నాలుగేళ్లు అభ్యసించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే దవాఖానలో రోగులకు సేవలు కూడా అందించాలి. మొదటి సంవత్సరంలో విద్యార్థులు 450 గంట లు, రెండో సంవత్సరంలో 750 గంటలు రోగులకు సేవలు చేయాలి. ఇక మూడో సంవత్సరంలో మానసిక, పిల్లలు, ఇతర శస్త్ర చికిత్సల విభాగంలో పనిచేయాలి. ఇక నాలుగో సంవత్సరంలో కమ్యూనిటీ హెల్త్, మహిళలకు సంబంధించిన వైద్య సేవలు అం దించాలి. వీరి పాఠ్యాంశాల ఆధారంగా శిక్షణలో అం దించిన సేవలకు వచ్చే మారులు కూడా కలుపుతారు.
నాకు రోగులకు సేవ చేయాలనే కోరిక ఉన్నది. అందులో భాగంగానే నర్సింగ్ కోర్స్ తీసుకున్న. విద్యలో భాగంగానే రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. మొదటి సంవత్సరంలోనూ వేములవాడ దవాఖానలోనే సేవలందించినం. ఇప్పుడు రెండో సంవత్సరం కూడా ఇకడే రోగులకు సేవలు చేస్తున్నం.
-పెంద్రం శ్రీయ, సెకండియర్ (మంచిర్యాల)
ఆరోగ్య సంరక్షకులుగా చేస్తున్న సేవలో ఆనందం ఉంది. మేం నర్సింగ్ సెకండియర్లోనే ఉన్నప్పటికీ చదువులో భాగంగా రోగులకు చేస్తున్న సేవలను గొప్ప అవకాశంగా భావిస్తున్నం. రోగుల నుంచి వస్తున్న ప్రశంసలతో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నం.
-లావణ్య, సెకండియర్ (మహబూబ్నగర్)
ఇకడి ప్రజల ఆదరణ తీరు చాలా బాగున్నది. నర్సింగ్ కోర్సులో భాగంగా నాకు సిరిసిల్లలో సీటు వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి ఇకడ రోగులకు సేవ చేస్తున్న. వారి నుంచి వస్తున్న ఆదరణ మర్చిపోలేను. తెలుగు నేర్చుకొని వారికి పూర్తిగా అర్థమయ్యే విధంగా రోగులకు వివరిస్తున్న. ప్రజల మాట తీరు కూడా బాగుంది.
– పల్లవి కర్యాల్, సెకండియర్ (జమ్మూకశ్మీర్)
ఇకడి పరిస్థితుల్లో వాతావరణం మాకు అలవాటైపోయింది. ప్రభుత్వ దవాఖాన పెద్ద కార్పొరేట్ దవాఖానలాగా ఉంది. రెండో సంవత్సరం కూడా ఇకడే విద్యలో భాగంగా సేవ అందిస్తున్న తీరుతో రోగుల నుంచి వస్తున్న అభిమానం మర్చిపోలేం. ప్రజలు ఆప్యాయంగా ఉంటరు. చేసిన సేవను గుర్తిస్తున్నరు కూడా.
-తానియా, సెకండియర్ (జమ్మూ కాశ్మీర్)
నర్సింగ్ విద్యార్థులకు బోధనతోపాటు శిక్షణ కూడా ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం దాకా వారు దవాఖానల్లో రోగులకు సేవలు కూడా అందించాలి. రోగులకు అనేక రకాల సేవలను అందిస్తూ శిక్షణ పొందుతారు. వారి పాఠ్యాంశాల ఆధారంగా మారులు కూడా వేయాల్సి ఉంటుంది.
– మెరీనా రాణి, అధ్యాపకురాలు (సిరిసిల్ల నర్సింగ్ కళాశాల)