Karimnagar | ముకరంపుర, జూన్ 4 : అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం కరీంనగర్ నగరంలోని డీర్ పార్కులో విద్యార్థులకు అటవీశాఖ అధికారులు చిత్ర లేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఒకటి నుంచి 7 వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖనం, 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాల భవన్, పలు విద్యాసంస్థలకు చెందిన 104 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, కరీంనగర్ రేంజ్ అధికారి ఎస్ కే షౌకత్ హుస్సేన్, డిప్యూటీ రేంజ్ అధికారి ఏ ఆనంద్ కుమార్, డీర్ పార్క్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.