కమాన్చౌరస్తా, మార్చి 22: ‘అందరి సంతోష మే మా ఆనందం. ప్రజలంతా సుఖ సంతోషాల తో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి. అదే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని’ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా జిల్లా యత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన పంచాంగశ్రవణం, కవి సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తనది కన్యా రాశి అని, ఆదాయం తకువ వ్యయమెకువని, రాజ్యపూజ్యం తకువ, అవమానాలెకువని పం చాంగం చెబుతోందని, పాలకుల రాశిఫలాల ప్రభావం ఎలా ఉన్నా, ప్రజల రాశిఫలాలు బాగుండాలని ఆకాంక్షించారు. ఆదే తమ ప్రభు త్వం కోరుకుంటుందన్నారు.
కొత్త సంవత్సరం అందరికీ కలిసి రావాలని ఆకాంక్షించారు. అలాగే, కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు పుట్టినిళ్లయిన కరీంనగర్ జిల్లా ఖ్యాతిని పెంచేలా జిల్లాలో వారికోసం వేదిక నిర్మిస్తామని, ఆరునెలల్లో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమా ర్ మాట్లాడుతూ ఆదాయవ్యయాలైనా, రాజ్యపూజ్య అవమానాలైనా వ్యక్తిగతమని, మన ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటాయన్నారు. మన జీవన విధా నం, ప్రగతి, మంచి చెడులను నిర్ణయించే పంచాం గం పూర్వీకులు ప్రసాదించిన ఒక దిక్సూ చి అన్నా రు. ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందని, అలజడులుండవని పంచాంగం ద్వారా తెలియడం సంతోషంగా ఉందని, ఇదో శుభసూచకమన్నారు. పురాణం మహేశ్వరశర్మ పంచాంగ పఠనం చేశారు. అంతకు ముందు, ఆ తర్వాత కవు లు, రచయితలు తమ కవితలను వినిపించారు. ఈ సందర్భంగా వజ్రోత్సవ కవితా సంపుటి స్వతంత్ర కాహళ పుస్తకావిషరణ చేశారు. అనంతరం పలువురు కవులను సత్కరించారు. ఇక్కడ జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్యే రవిశంకర్, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాల్, సీపీ సుబ్బారాయుడు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, వ్యాఖ్యాతలు కేఎస్ అనంతాచార్య, నంది శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.