Jagityal | జగిత్యాల రూరల్ : అమావాస్య అన్నపూర్ణ మాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతీ అమావాస్య రోజున అన్నదానం చేయడం అభినందనీయమని కౌన్సిలర్ మూలస్తం లావణ్య మహేష్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ చౌరస్తా వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అన్నదానం చేయడం అన్నిదానాలలోకెళ్లా గొప్పదని చెప్పారు. ఈ సందర్భంగా 200 మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనంతుల సతీష్ కుమార్, హరీష్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.