కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజ్యసభ స్థానానికి ‘నమస్తేతెలంగాణ’ సీఎండీ, టీఆర్ఎస్ అభ్యర్థి దీవకొండ దామోదర్రావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్తో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆయన ఎన్నిక లాంఛనం కానుండగా జగిత్యాల, రామగుండం ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్కుమార్, కోరుకంటి చందర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.