బోయినపల్లి, జూలై 7: బోయినపల్లి మం డలం విలాసాగర్ రైతులకు సాగు నీరు విడుదలైంది. దీంతో రైతులు సంతోషంలో ఉన్నారు. విలాసాగర్ పెద్ద చెరువు నింపేందుకు ప్రభు త్వం వరద కాలువ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పా టు చేసి మోటర్లు బిగించారు. మూడేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను ప్రారంభించారు. అప్పటి నుంచి విలాసాగర్ రైతులకు సాగు నీరు అవసరం ఉన్నప్పడు వరద కాలువ ద్వారా పక్కనే ఉన్న పెద్ద చెరువును నింపుకుంటున్నారు. ఈ ఏడాది వరుణుడు కరుణించకపోవడంతో రైతులకు సాగునీటి కొరత ఏర్పడిం ది. దీంతో స్థానిక మండల ప్రజాప్రతినిధులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి విలాసాగర్ చెరువును నింపాలని కోరారు.
వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా గు రువారం వరదకాలువ పక్కన ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేశారు. నీటిని ఎ త్తి పోసే మోటర్లను ఎంపీపీ పర్లపల్లి వేణుగోపా ల్, సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం వరద కాలువలోని గోదావరి జలాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి మాట్లాడుతూ రైతు కుటుంబాల్లో ఆనందం చూడడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.