రాంనగర్, డిసెంబర్ 16: కాంగ్రెస్ సరార్ను కేసీఆర్ కూల్చే కుట్ర చేస్తున్నారంటూ ఎంపీ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బహిర్గతం చేయాలని కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. సంజయ్ వ్యాఖ్యలు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిసేలా ఉన్నాయని మండిపడ్డారు.
దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంగళవారం టౌన్ ఏసీపీ నరేందర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరిగిందన్న విషయం ఆయనకు ఎలా తెలిసిందో చెప్పాలని, ఆ వివరాలు బహిర్గతం చేయకపోవడం కూడా నేరమే అవుతుందన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, కొరివి అరుణ్ కుమార్, తాజుద్దీన్, శ్రవణ్, చర్ల పద్మ, అబ్దుల్ రెహమాన్, తదితరులున్నారు.
ఎంపీ సంజయ్ చేసిన వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న కుట్రను చేధించాలని కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. సంజయ్ వ్యాఖ్యల వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.