ధర్మారం, జూలై 18: ధర్మారం మండలం నంది మేడారంలో వరద బాధితుల ఇండ్లను కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఇటీవల పరిశీలించారు. మంత్రి ఈశ్వర్పై ఆరోపణలు చేయగా, ధర్మారం మండల టీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. 16న ప్రెస్మీట్ పెట్టి అడ్లూరిపై నిప్పులు చెరిగారు. ధర్మారం మండలం, నందిమేడారం అభివృద్ధిపై బహిరంగంగా చర్చిద్దామని, 18వ తేదీన ధర్మారంలో చర్చావేదిక నిర్వహిస్తామని, దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు.
సోమవారం ధర్మారం అంబేద్కర్చౌరస్తాలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, ఏఎంసీ చైర్మన్ కొమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, జడ్పీ, మండల కోఆప్షన్ సభ్యులు ఎండీ సలామొద్దీన్, ఎండీ రఫీ, ఉప సర్పంచ్ ఆవుల లత చర్చవేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి 11:30 దాకా వేచిచూశారు. గడువు దాటినా అయినా అడ్లూరి రాలేదు. దీంతో ప్రజాప్రతినిధులు, నాయకులు ఆగ్రహించారు. కాగా, చర్చవేదిక గడువు ముగిసిన తర్వాత లక్ష్మణ్కుమార్ ధర్మారంలోని పాత బస్టాండ్కు చేరుకున్నారు. ఆ తర్వాత పొరుగు మండలాల కాంగ్రెస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తాకు వచ్చారు.
ఇప్పటికైనా పద్ధతి మార్చుకో..
అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని టీఆర్ఎస్ నాయకులు సూచించారు. మంత్రి ఈశ్వర్పై అనవసర అరోపణలు చేయడం మానుకోవాలన్నారు. అడ్లూరి వద్ద మాట్లాడడానికి ఏమీ లేదని, అందుకే హాజరుకాలేదని, ఇలా డుమ్మాలు కొట్టడం ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. గతంలో కరీంనగర్లోనూ చర్చ వేదిక పెడితే తోకముడిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ హయాంలో జరిగిన అభివృద్ధి, ఎల్ఎం కొప్పుల ట్రస్ట్ సేవలను, లక్ష్మణ్కుమార్ వైఫల్యాలను మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, దొనికెని తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, పార్టీ అనుబంధ కమిటీల మండలాధ్యక్షులు మంద శ్రీనివాస్, గుజ్జేటి కనకలక్ష్మి, భారత స్వామి, అజ్మీరా మల్లేశం, ఎండీ హఫీజ్, దేవి నళినీకాంత్, దేవి వంశీక్రిష్ణ, సోషల్ మీడియా సెల్ మండల ప్రధాన కార్యదర్శి సల్వాజి మాధవరావు, ధర్మారం పార్టీ పట్టణ మండలాధ్యక్షురాలు దేవి లావణ్య, తదితరులు ఉన్నారు.