జగిత్యాల, డిసెంబర్ 7: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, దివాకరను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశా రు. పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అంశాలపై చర్చించారు.
జగిత్యాల, డిసెంబర్ 7: జిల్లా కేంద్రంలో ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ట్రస్మా కార్యవర్గ సభ్యులు గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సతరించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలుపొందడంపై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు యాద రామకృష్ణ, కార్యదర్శి అనుమల్ల శ్యామ్, ట్రెజరర్ జీవన్ రెడ్డి, కరస్పాండెంట్లు క్యాతం గంగారెడ్డి, కంది కైలాసం, రాజేందర్, మనోహర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఎండీ ఇజాజ్ పాల్గొన్నారు.
రాయికల్, డిసెంబర్ 7: పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీసత్య దవాఖానను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వైద్యులు పూలమాల, శాలువాతో సతరించారు. కార్యక్రమంలో వైద్యులు ఉదయ్ కుమార్, శిల్ప, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాం డ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, మారెట్ కమిటీ చైర్ పర్సన్ రాణి-సాయికుమార్, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
జగిత్యాల, డిసెంబర్ 7: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు సమిండ్ల శ్రీనివాస్ మామ, కౌన్సిలర్ వాణి తండ్రి మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాధిక దంపతులు పరామర్శించారు. 33వ వార్డుకు చెందిన వొల్లెం మధుసూదన్, 30వ వార్డుకు చెందిన అయాన్, జావిద్ ఇటీవల మృతిచెందారు. కాగా, బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, పట్టణ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, వొల్లెం మల్లేశం, కత్రోజు గిరితోపాటు పలువురు పాల్గొన్నారు.