గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘సీఎం కప్a-2023’ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మండలస్థాయిలో ఈ నెల 17వరకు క్రీడా పోటీలు జరుగనుండగా, పోటీలను ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ముందుగా మండలస్థాయిలో మూడు రోజులపాటు అథ్లెటిక్స్ , ఫుట్ బాల్ , కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తుండగా, మొదటిరోజు 15 నుంచి 36 ఏళ్లలోపు క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు.
– కొత్తపల్లి, మే 15
కొత్తపల్లి, మే 15 : కరీంనగర్ మండలంలోని నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ -2023 క్రీడలను అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఇరుకుల్ల-నగునూర్ వాలీబాల్ క్రీడలు ప్రారంభించారు, టీమ్ సభ్యులు, కెప్టెన్లను కలిసి కరచాలనం చేస్తూ అదనపు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మానకొండూర్ మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్ మండలస్థాయి క్రీడాపోటీల కార్యక్రమానికి బీఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. చొప్పదండి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో, రామడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎంకప్ క్రీడలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు.
విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ప్రతి చిన్న గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే పేరొన్నారు. హుజూరాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో, వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా జమ్మికుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో, ఇల్లందకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి మండలి విప్ సీఎం కప్ పోటీలను ప్రారంభించారు.