కొత్తపల్లి, మే 22: సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించాయని, కానీ స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ తగిన ప్రా ధాన్యం ఇస్తున్నారని, పెద్దపీట వేస్తున్నారని మం త్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చీఫ్ మినిస్టర్స్ కప్ 2023 పేరిట క్రీడా పోటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పా రు. ఈ అవకాశాన్ని గ్రామీణ యువత సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా రాణించాలని సూ చించారు. సోమవారం కరీంనగర్ అంబేదర్ స్టేడియంలో సీఎం కప్ 2023 జిల్లా స్థాయి క్రీడోత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పతాకాన్ని ఆవిషరించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.
ప్రస్తు త కాలంలో ఆరోగ్యవంతమైన జీవితం కేవ లం క్రీడల ద్వారా మాత్రమే దొరుకుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలపై ఆసక్తిని పెంచేలా ప్రోత్సహించాలన్నారు. హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో జిల్లా క్రీడాకారు లు ప్రతిభచూపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్లు అత్యధిక విజయాలను నమో దు చేసి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించా రు. మేయర్ సునీల్రావు మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి వేదికలు దోహదపడుతాయన్నారు. జిల్లా స్థాయి పోటీలకు హాజరైన క్రీడాకారులందరికీ నగర పాల క సంస్థ తరపున భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన వస్తోందని, మండల స్థాయి పోటీల్లో సు మారుగా 4వేల మంది పాల్గొన్నారని, జిల్లా స్థాయి పోటీల్లో సుమారు 1200 మంది క్రీడాకారులు పాల్గొనడమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పుట్బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని మ్యాచ్లను ప్రా రంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డీఈఓ సీహెచ్ జనార్దన్రావు, రాష్ట్ర బే స్బాల్ సంఘం అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్ధన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, డీవైఎస్ఓ కీర్తి రాజవీరు, ఎన్వైకే కో ఆర్డినేటర్ వెంకట రాంబా బు, ఎస్జీఎఫ్ కా ర్యదర్శి శ్రీనివాస్, పెటా సంఘాల బాధ్యులు సొల్లు సారయ్య, అంతటి శంకరయ్య, అంతడుపు శ్రీనివాస్, ఎండీ యూనిష్ పాషాతో పాటు కార్పొరేటర్లు, ఎంపీడీవోలు, క్రీడా సంఘాల భాద్యులు, సీనియర్ క్రీడాకారులు ఉన్నారు.