మధ్యాహ్న భోజన కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నెలనెలా ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోగా, వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ మేరకు ఆదివారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో సంబురాలు జరుపుకొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
-సిరిసిల్ల టౌన్/ కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 5