మేడిపల్లి, మార్చి 19 : కాంక్రీట్ మిక్సర్ వాహన డ్రైవర్ అజాగ్రత్తతో ఓ బాలుడి ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా రివర్స్ చేయడంతో గోడకు తగలగా, దాని పక్కన కూర్చున్న బాలుడి తలపై గోడ పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మేడపల్లి ఎస్ఐ శ్యామ్రాజ్ వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా వడ్డెరగూడెం గ్రామానికి చెందిన సంపంగి సంగీత, శ్రీను దంపతులకు కూతురు నిహారిక (7), కొడుకు గణేశ్ (4) ఉన్నారు. వీరు గత నెల రోజుల నుంచి కరీంనగర్లో కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి మేడిపల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఎన్నమనేని ప్రణవికి చెందిన పౌల్ట్రీ ఫామ్ పనులు చేస్తున్నారు. అదే ఫామ్లో పని చేస్తున్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన అమరగోని రాజు అజాక్స్ కాంక్రీట్ మిక్సర్ వాహనాన్ని అజాగ్రత్తగా రివర్స్ తీయడంతో అది గోడకు తగిలింది. దీంతో ఆ పక్కనే కూర్చున్న సంపంగి గణేశ్పై గోడ కూలడంతో తల నుజ్జునుైజ్జె అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లి సంగీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్యామ్రాజ్ తెలిపారు.