Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 7 : మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన నిమిషకవి సారంగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా వీరి కుమారులైన పాత్రికేయుడు నిమిషకవి రాజేష్, రవి కలిసి సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులను తన తండ్రి జ్ఞాపకార్ధం బాడీప్రీజర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో తండ్రి పేరు మీద చిన్న పాలసీ తీసుకోవడంతో తమ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చిందని, దీంతో కొంత మేరకు గ్రామానికి సేవ చేయలన్న ఆలోచనతో బాడీప్రీజర్ ను జీపీ అందజేసినట్లు తెలిపారు.
ఈ బాడీప్రీజర్ సేవలను మండల వ్యాప్తంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి, డీజీఎం సురేష్, డీఎం రవి, మేనేజర్ నరేష్, డీవోలు రాజేష్, గణేష్, మాజీ జడ్పీటీసీ ఎలాల జలపతిరెడ్డి, బీజేపీ పార్టీ మండలాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.