చొప్పదండి, డిసెంబ 23: బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కేంద్రంలోని బీజేపీ సరా ్కరు కుట్రలు చేస్తున్నదని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతలా రాజ్యాంగాన్ని నిర్వీ ర్యం చేయలేదని విరుచుకుపడ్డారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్లో జరుగుతున్న భారత రాజ్యాంగ రక్షణ శిక్షణ తరగతులకు ఆయన ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దేశంలోని ప్రజలందరికీ క ల్పించిన హక్కులను, అధికారాలను, ము ఖ్యంగా రిజర్వేషన్లను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మం డిపడ్డారు. తొమ్మిదేండ్ల పాలనలో ప్రజల మధ్య కులమతాల పేరిట చిచ్చు పెట్టిందే తప్పా చేసిందేంలేదని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పి కొట్టేలక్ష్యంతో యువతను మరో పోరాటానికి సన్నద్ధం చేసేందుకే రాజ్యాంగ శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.