కమాన్చౌరస్తా, డిసెంబర్ 31: 2022కు వీడ్కోలు పలుకుతూ 2023 కొత్త ఏడాదికి నగర ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. శనివారం అర్ధరాత్రి నుంచే హంగామా కొనసాగింది. అర్ధరాత్రి 12 గంటలు కాగానే యువతీయువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొత్త ఏడాదిని స్వాగతించారు. కేక్లు కట్ చేసి నోళ్లు తీపి చేసుకున్నారు. అంతకు ముందు పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విందు వినోదాలతో గడిపారు. పలు విద్యాసంస్థల్లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. నృత్యాలతో విద్యార్థులు హోరెత్తించారు. ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నూతన సంవత్సర ముందస్తు సంబురాలు నిర్వహించారు.
అల్ఫోర్స్ పాఠశాలలో..
కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాల ప్రాంగణంలో 2022కు వీడ్కోలు, 2023 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు కళల వైభవాన్ని విశ్లేషించి చెప్పాలని, తద్వారా వారికి కళల పట్ల ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో కరస్పాండెంట్ వీ రవీందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక్కడ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పారమిత పాఠశాల విద్యార్థులు..
పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలను రేకుర్తిలోని అంధుల పాఠశాలలో నిర్వహించారు. అంధ విద్యార్థులకు పండ్లు, స్వీట్లు, బిసెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సంజయ్ భట్టాచార్జీ, ప్రోగ్రాం హెడ్ గోపీ, సమన్వయకర్త శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాల చైర్మన్ ప్రసాదరావు అభినందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పట్టణంలోని పలు పార్కులు, అపార్ట్మెంట్లలో కిట్టీ పార్టీ మహిళలు 2022కు బైబై చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబురాలు జరుపుకొన్నారు.
కొత్తపల్లి, డిసెంబర్ 31: కరీంనగర్లోని మానేరు పాఠశాలలో న్యూ ఇయర్ కేక్ను విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి విద్యార్థులతో కలిసి కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకల్లో పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక మెహర్నగర్లోని వింధ్యావాలీ ఉన్నత పాఠశాలలో చైర్మన్ రామవరం లక్ష్మీప్రకాశ్రావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ చైర్మన్ పృథ్వీరావు, ప్రిన్సిపాల్ ప్రశాంత్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేకుర్తిలోని తేజస్ జూనియర్ కళాశాలలో చైర్మన్ సీహెచ్ సతీశ్రావు, వైస్ చైర్మన్ మౌనిక జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కిషన్రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 31: నగునూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థినులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీహరి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సమత, గ్రంథాలయాధికారి మోహన్రావు, అధ్యాపకులు కవిత, లావణ్య, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. స్థానిక వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర కేక్ను కళాశాల అడిషనల్ డైరెక్టర్ గోవిందరావు కట్ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళి, ఏవో సాగి సుధాకర్ రావు, లక్ష్మణ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గ్గొన్నారు.