కరీంనగర్ రూరల్, జూలై 26 : రాష్ట్రంలోనే కరీంనగర్ ని యోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగు ల కమలాకర్ ప్రకటించారు. పెద్దమొత్తంలో నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. బు ధవారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లోని గుజ్జులపల్లి రోడ్డు నుంచి ప్రశాంత్నగర్కాలనీ, సుల్తానాబాద్ మండ లం దుబ్బపల్లి వరకు బీటీ రోడ్డు, చామనపల్లి నుంచి బహ్దుర్ఖాన్పేట రోడ్డు, చామనపల్లి నుంచి చాకుంట రోడ్డు నిర్మాణ పనులు, ఎస్సీ కాలనీలో రోడ్డు పునరుద్ధరణ, గౌడ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చే శారు. అనంతరం మంత్రి మాట్లాడారు. చెర్లభూత్కూర్లోని పోచమ్మ వాగు నుంచి ప్రశాంత్నగర్ కాలనీ, దుబ్బపల్లి వరకు రూ.4 కోట్లతో చేపట్టిన పనులను గడవులోగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. పోచమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్అండ్బీ ఏఈ లక్ష్మణ్రావులో ఫోన్చేసి ఆదేశించారు. చామనపల్లి-చాకుంట రోడ్డు, కల్వర్టు పనులను నాణ్యతతో పూర్తిచేయాలని సూచించా రు.
కరీంనగర్తోపాటు అన్ని గ్రామాల్లో మట్టిరో డ్లు కనిపించకుండా చేస్తామని చెప్పారు. ప్రస్తు తం వర్షాలు భారీగా కురుస్తున్నందునా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సర్కారు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉన్నదని, ఎలాం టి విపత్తునైనా ఎదుర్కొంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో కరీంనగర్ను రాష్ట్రం లో హైదరాబాద్ తర్వాత రెండో గొప్ప నగరంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు. అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుంచే నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృ షి చేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మ య్య, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, సింగిల్ విండోచైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వర్రావు, సర్పంచులు దబ్బెట రమణారెడ్డి, బొగొండ లక్ష్మి, పురుమల్ల శ్రీనివాస్, తపట్ల భూమయ్య పాల్గొన్నారు.