కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మానకొండూర్లోని పల్లెమీది చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణుతోపాటు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, కవిత అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు.
ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరాస్తాలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసనలు తెలుపగా, గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, చొప్పదండిలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, రామడుగులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ దళం భగ్గుమన్నది. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అగ్రనాయకురాలు కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలతో హోరెత్తించింది. నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు చేతబట్టి రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపింది. కేంద్రం, మోడీ దిష్టిబొమ్మలు దహనం చేసి, ‘మోడీ డౌన్ డౌన్.. ఈడీ డౌన్ డౌన్’ అంటూ నినదించింది. ఈడీ తీసుకున్న అసంబద్ధ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే, బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని స్పష్టం చేసింది.
కాగా, ఆయాచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పాల్గొని, ఈడీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇదంతా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న డ్రామా అని, కేసీఆర్, బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకే ఇలా అరెస్టుల పేరిట బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నదని మండిపడ్డారు. రెండేళ్ల పాటు నిరీక్షించి ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో మోడీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసులకు భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.