ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభం
పట్టణ ప్రగతి పనుల పరిశీలన
జగిత్యాల, జూన్ 6: పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని 18వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మినీ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని, రైతు బజార్లో పట్టణ ప్రగతి నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన చేపల మారెట్ను ప్రారంభించారు. రైతు బజార్లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో మాధురి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత రైతు బజార్ను అభివృద్ధి చేసి ఇకడ హోల్సెల్ మారెట్ను అభివృద్ధి చేయడం వల్ల కోట్లలో వ్యాపారం జరుగుతుందన్నారు. రైతులు, గంగపుత్రులు సహకరించి మారెట్లో మాత్రమే క్రయవిక్రయాలు చేయాలని కోరారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో పారిశుధ్యం, హరితహారంపై చిత్తశుద్ధితో పని చేయాలని, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. పక జిల్లాల నుంచి కూడా కూరగాయ ల కొనుగోలుకు ఇకడకు వస్తున్నారని తెలిపారు. జగిత్యాల చుట్టూ మారెట్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పే ర్కొన్నారు. రూ. 4 కోట్లతో సమీకృత మారెట్ నిర్మాణం జరుగుతుందని, వెజ్, నాన్ వెజ్ మారెట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు చుక నవీన్, పద్మ-సింగారావు, సమిండ్ల వాణి-శ్రీనివాస్, కోరె గంగమల్లు, బండారి రజని-నరేందర్, కూతురు రాజేశ్, బద్దం లత-జగన్, పిట్ట ధర్మరాజు, కూసరి అనిల్, ముసు నారాయ ణ రెడ్డి, బొడ్ల జగదీశ్, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, వొల్లెం మల్లేశం, కమిషనర్ స్వరూపారాణి, డీఈ రాజేశ్వర్, వాకర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఆర్థిక ఎదుగుదలకు ప్రాధాన్యత
రాయికల్ రూరల్, జూన్ 6: టీఆర్ఎస్ ప్రభుత్వం గంగ పుత్రులు ఆర్థికంగా ఎదగడానికి ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. రామాజీపేట్లో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవ కార్యక్రమంలో సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని గంగపుత్రులకు సూచించారు. సంఘ నాయకులు పాల్గొన్నారు.
సుద్దాల దేవయ్యకు పరామర్శ
జగిత్యాల రూరల్, జూన్ 6: మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సతీమణి సుద్దాల లత ఆదివారం అనారోగ్యంతో మరణించగా జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం గ్రామంలో సోమవారం దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా ఎయ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన రాజేశం గౌడ్ అంతిమ యాత్రలో పాల్గొని, సుద్దాల దేవయ్యను ఆయన స్వగృహంలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే జగిత్యాల పట్టణంలో మారెట్ రోడ్డు కస్తూరి స్ట్రీట్కు చెందిన ఊటూరి పురుషోత్తం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, కిష్టయ్య, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.