కోరుట్ల రూరల్, జూన్ 29: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హకు ఎంతో కీలకమైందని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హకు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. త్వరలోనే చేపట్టే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామగ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం కోరుట్ల మండలంలోని జోగిన్పల్లి, పైడిమడుగు గ్రామాల్లో వేర్వేరుగా బీఎల్ఏలతో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన, ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు.
ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో ప్రతిఒకరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బూత్ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. సర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల పరిశీలన, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలన్నారు. ఆయా సమావేశాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు దుంపల రాజనర్సయ్య, గడిగొప్పుల గోపాల్, తురగ సంజీవరెడ్డి, పల్లికొండ నరేశ్, దేవారెడ్డి, సామ నాగేశ్వర్, బుచ్చిరెడ్డి, సురేందర్ రావు, నర్సయ్య, దేవయ్య, నరేశ్, రమేశ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.