మీరు కొత్తగా బైక్ లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఏ కంపెనీది అయితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా..? లోన్కు వెళ్తే ఏఏ బ్యాంకుల వడ్డీ శాతం ఎంత? అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ‘నమస్తే తెలంగాణ’ చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నది. ప్రముఖ కార్ల, ద్విచక్ర వాహనాల సంస్థలు, ప్రధాన బ్యాంకులతోపాటు కొత్త మోడల్ బైకులు, కార్లను ఒకే వేదికగా మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ నెల 23 ,24 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే మైదానం (సర్కస్ గ్రౌండ్)లో మెగా ఆటో షో నిర్వహిస్తున్నది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై, ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ముగిసే ఈ ప్రదర్శనకు ఎంట్రీ ఉచితమని, వివరాలకు 9182777571, 9182777572 సెల్నంబర్లలో సంప్రదించాలని ‘నమస్తే’ యాజమాన్యం పేర్కొంది.
కార్పొరేషన్, మార్చి 21: ప్రస్తుత ఆధునిక సమాజంలో బైక్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది. కానీ, బైక్తోపాటు కారు కూడా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో వాహనాల వినియోగం పెరిగింది. ప్రజల్లోనూ ఆధునిక బైక్స్, కార్ల మోడల్స్పై ఆసక్తి కనిపిస్తున్నది. గతంలో బైక్ అంటే ప్రయాణాలకు మాత్రమే అన్నట్టుగా ఉండేది.
కానీ ఇప్పుడు బైక్లో దారి చూపే మ్యాప్, ఫోన్ ఛార్జ్, డిజిటల్ మీటరింగ్ ఇలా ఎన్నో సౌకర్యాలను ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో ఈబైక్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ వాహనాలను కొనేందుకు మక్కువ చూపుతున్నారు. మరోవైపు కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే చాలు కారు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కరోనా కాలంలో ఎక్కువ మంది వ్యక్తిగత రవాణాకు అలవాటు పడడంతో సొంత వాహనాల కొనుగోలుకు ఇష్టపడుతున్నారు.
కంపెనీలు సరికొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలోనే నయా మోడళ్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఇటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అతి తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తున్నాయి. జీరో డౌన్ పేమెంట్ లేదా అతి తక్కువ డౌన్ పేమెంట్ చేసినా రుణాలు అందిస్తున్నాయి. ఇవన్నీ వినియోగదారులను ఆకర్శిస్తున్నాయి. మరోవైపు బైక్ అయినా.. కారు అయినా అవసరంగా మారిన నేపథ్యంలో వాహనాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా వాహనాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమ్ముడవుతున్నాయి.
మన జిల్లాలో ఇటీవలి కాలంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు రవాణా శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఇండ్ల కంటే కూడా ద్విచక్ర వాహనానే ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఇంటిలోనూ రెండు, మూడు బైక్లు కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కరోనా తర్వాత కార్లు కోనుగోళ్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గతంలో చేతిలో పూర్తి స్థాయి డబ్బులు ఉంటేనే వాహనం కొనే పరిస్థితి ఉండగా, ఇప్పుడు లోన్లు ఇస్తుండడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు రవాణాలో కీలకమైన ఆటోలకు కూడా తక్కువ వడ్డీలతో రుణాలు అందిస్తుండగా, నిరుద్యోగులు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు.
ఏటా ఉమ్మడి జిల్లా పరిధిలో వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా మన జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుండడం, వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించడంతో ప్రతి ఒక్కరికీ ద్విచక్ర వాహనం, ఇంటికో కారు కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఔత్సాహిక కొనుగోలుదారులందరికీ అన్ని వివరాలు ఒకే వేదికపై అందించాలన్న ఉద్దేశంతో కరీంనగర్లోని మహాత్మాజ్యోతిబాఫూలే (సర్కస్ గ్రౌండ్) మైదానంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో ఆటో షో నిర్వహిస్తున్నారు.
ఈ షోలో దేశంలోని ప్రముఖ వాహనాల సంస్థలతోపాటు రుణాలు అందించే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఈ షోకు మెయిన్ స్పాన్సర్ ఆదర్శ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేట్ స్పాన్సర్లుగా మహావీర్ గ్రూప్ మెర్సిడిస్ బెంజ్, ఆడి హైదరాబాద్, వోల్వో, మహావీర్ ఐసుజు, ప్రైడ్ జీప్, గ్రీన్ హోండా, మోటార్ లైన్ మహాంద్ర డీలర్, క్వాంటం ఈ స్కూటర్స్, కాకతీయ టయోటా, మారుతి సుజుకి, నెక్సా, మాతరుతి సుజుకి ఎరేన, ఆదర్శ ట్రూ వాల్యూ, మాలిక్ కియా, హఋరా సుజుకి సంస్థలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా ఇతర సంస్థలు పాల్గొంటున్నాయి.