కోనరావుపేట, ఫిబ్రవరి 8: వేములవాడ అనుబంధ మామిడిపల్లి శ్రీసీతారామస్వామి దేవాలయ ఆవరణలో జరిగే మాఘ అమవాస్య జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం జాతర ఏర్పాట్లను తహసీల్దార్ విజయ్ ప్రకాశ్రావు, ఎంపీడీవో రామకృష్ణ, ఆలయ సూపరింటెండెంట్ సిరిగిరి శ్రీరాములు, ఎస్ఐ ఆంజనేయులు పర్యవేక్షించారు.
అలాగే నాగారం శ్రీకోదండ రామస్వామి ఆలయ వద్ద జరిగే మాఘ మాస జాతరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ తెలిపారు. మండలంలోని మామిడిపల్లి, నాగారం రామాలయం, ధర్మారంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగే మాఘ అమవాస్య జాతరకు కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ హాజరుకానున్నారు.