భక్తులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
మంత్రి గంగుల కమలాకర్
రేకుర్తిలో అభివృద్ధి పనుల పరిశీలన
కార్పొరేషన్, ఫిబ్రవరి 8: కరీంనగర్లోని రేకుర్తిలో నిర్వహించే సమ్మక్క జాతరకు వచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మంగళవారం రేకుర్తి సమ్మక్క గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మేయర్ వై సునీల్రావుతో కలిసి పరిశీలించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి జాతరకు బల్దియా నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి పను లు చేపడుతున్నట్లు చెప్పారు. గద్దెల చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు బారి కేడ్లు ఏర్పాటు చే స్తున్నట్లు చెప్పారు. జగిత్యాల రోడ్డు నుంచి గద్దెల దాకా రోడ్డు నిర్మించడంతోపాటు నూతనంగా క్యూ లైన్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టామన్నారు. జగిత్యాల రోడ్డు సమీపంలోనే పార్కిం గ్ ఏర్పాటు చేస్తున్నామని, అక్కడి నుంచి భక్తులు నేరుగా గద్దెలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక్కడ కార్పొరేటర్లు సుధగోని మాధవీ కృష్ణాగౌడ్, ఎదుర్ల రాజశేఖర్, భూమాగౌడ్, జంగిలిసాగర్, పిట్టల వినోద శ్రీనివాస్ ఉన్నారు.