గోదావరిఖని, జనవరి 13 : “తెలంగాణ కోసం నాడు శాంతియుతంగా ఉద్యమ పోరు జరిపిన వాళ్లు ఉద్యమకారులు కాదా?, వాళ్లు ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తెస్తరు?” అని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకు లు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకా ల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు స్థానిక ప్రెస్క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయనున్న ఆరు గ్యారంటీ పథకాల్లో ఉద్యమకారులను కూడా చేర్చిందని, కానీ దరఖాస్తు ఫారంలోని చివరి కాలం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అడిగిన బ్లాక్ నంబర్ 02లోని సబ్ క్లాజ్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ఎఫ్ఐఆర్ నంబర్, జైలుకు వెళ్లిన వివరాలు అడుగుతున్నదని, శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించిన వారికి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
అలాంటి వా రికి కూడా అవకాశం కల్పించి లబ్ధిచేకూరే విధం గా ఒక క్లాజును చేర్చాలని కోరారు. సమావేశం లో విజయానంద్, అమరేందర్రావు,జేవీ రాజు, తూముల అశోక్, ఏలేశ్వరం వెంకటేశ్, కానుగంటి శ్రీనివాస్, విజయ్కుమార్, రాజేశ్ శర్మ, సమ్మారావు, అందె సదానందం పాల్గొన్నారు.