వెల్గటూర్, నవంబర్ 27: అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ కొప్పుల స్నేహలత ఈశ్వర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెల్గటూర్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే ‘ సంఘం శరణం గచ్ఛామి’ నృత్య రూప నాటక ప్రదర్శన ద్వారా శనివారం రాత్రి అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రదర్శించారు. అంతకు ముందు జడ్పీటీసీ సుధారాణితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి, నాటకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ చిన్నతనంలో అనేక అష్టకష్టాలు పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో నూతనంగా నిర్మి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. అకాడమీ వారు అంబేద్కర్ చరిత్రను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించడంతో ప్రేక్షకుల కండ్ల్లు చెమ్మగిల్లాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యా యవాది, దళిత సాహితీ వెత్త కోరివి వేణు గోపా ల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, టీ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్కల్ల గంగారాం, ప్యాక్స్ చైర్మన్లు గూడా రాంరెడ్డి, రత్నాకర్, ఎంపీటీసీ పెద్దూరి హారిక-భరత్ కుమార్, కో అప్సన్ సభ్యులు రి యాజ్, సర్పంచ్లు మారం జలేందర్రెడ్డి, బోడకుంటి రమేశ్, చల్లూరి రూపారాణి, మార్కేట్ కమిటీ మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు చల్లూరి రాంచందర్గౌడ్, సింహాచలం జగన్, మాజీ అద్యక్షులు మూగల స త్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కొప్పుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి,నవంబర్ 27: అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు తెలియజేసేలా ఎల్ఎం కొ ప్పుల సోషల్ సర్వీస్ చైర్పర్సన్ స్నేహలత ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే నిర్వహించే నృత్యరూప కళాప్రదర్శన కరపత్రాన్ని ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా..ధర్మపురి మండలం దోనూర్లో ఈనెల 30న నిర్వహించనుండగా, కార్యక్రమానికి సం బంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, మండల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మొగిలి శేఖర్, ఆకుల రాజేశ్, కౌ న్సిలర్లు అయ్యోరి వేణు, తరాల కార్తీక్, తిర్మందాసు అశోక్, నాయకులు చిలివేరి శ్యాంసుందర్, మురళి, అప్పాల వసంత్, వేముల నరేశ్, చీర్నేని నర్సయ్య, అవునూరి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.