కరీంనగర్ కమాన్చౌరస్తా, ఏప్రిల్ 29 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుబి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వావిలాలపల్లి అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో సత్తా చాటిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ విద్యార్థులు ఎప్పటిలాగే ఈ సంవత్సరం సైతం పై చేయి సాధించడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను సాధించారని, అల్ఫోర్స్ విద్యా విధానానికి ఒక గొప్ప ప్రతిక అని చెప్పారు.
ఆర్ సాత్విక్ 589 మారులతో అగ్రస్థానంలో నిలిచాడని, ఓ ఆద్య, టీ రాజు, బీ అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించారని, మొత్తం 1274 మంది విద్యార్థులకు 1026 విద్యార్థులు 500కుపైన మార్కులు పొందారని, 48 మంది విద్యార్థులు 580కుపైగా మారులు, 334 మంది విద్యార్థులు 560కుపైగా మారులు సాధించడం చాలా గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాల సాధనకు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.