కలెక్టరేట్, మే 26 : పాలిసెట్ ఫలితాల్లో నగరంలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థిని పులి శ్రీనిత్యారెడ్డి రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు సాధించింది. అగ్రికల్చర్ డిప్లొమా విభాగంలో ఈ ర్యాంకు సాధించగా, విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధించడంతోనే తమ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు పొందుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్ఫోర్స్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.