సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 9 : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో భారీ మద్యం డంపును పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. భారీగా మద్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు మంగళవారం కాట్నపల్లి శివారులోని పాతబడ్డ రైస్మిల్లులో తనిఖీలు చేశారు. సుమారు 7 లక్షల విలువైన మద్యం డంపును పట్టుకున్నారు.
ఇది మధ్యప్రదేశ్కు చెందిన లిక్కర్గా గుర్తించారు. దాదాపుగా 90 కాటన్ల లిక్కర్ను సీజ్ చేసి, సుల్తానాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించినట్లు పెద్దపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి తెలిపారు. మద్యం డంప్ ఎవరిదనే విషయాన్ని ఎక్సైజ్ పోలీసులు ఆరా తీసున్నారు. దాడులు చేసిన వారిలో సుల్తానాబాద్ సీఐ గురునాథ్ రాథోడ్, పెద్దపల్లి సీఐ శిరీష, ఎస్ఐ చిరంజీవి, సిబ్బంది ఉన్నారు.