ఉమ్మడి జిల్లా నుంచి 530 ఆర్టీసీ బస్సులు
అమ్మవార్ల గద్దెల వరకు బస్సు సౌకర్యం
పార్సిల్ ద్వారా మొక్కులు చెల్లించుకునే అవకాశం
తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 12: జాతరకు వెళ్లే భక్తుల సేవలో ఆర్టీసీ తరించనుంది. తెలంగాణ కుంభమేళగా భావించే మేడారం సమ్మ క్క-సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులను తరలి చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో పది డిపోలు ఉండగా అందులో ఆరు డిపోల్లో కేంద్రా లను ఏర్పాటు చేసి 530 బస్సులను తిప్పనుంది. నేరుగా జాతర గద్దెవద్దకు జనం చేరేల అవకాశం కల్పించింది. జాతరకు వెళ్లలేని భక్తులకు పార్సిల్ ద్వారా మొక్కులు చెల్లించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. మహా జాతరకు వెళ్లే భక్తులను తరలించేందుకు టీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చే సింది. ఈసారి ప్రయాణికులను నేరుగా మేడారం అమ్మవార్ల గద్దెల వరకు చేరుకునే సదుపాయం కల్పించింది. కరీంనగర్ రీజియన్ పరిధిలో పది డిపోలు ఉండగా, అందులో ఆరు బస్టాండ్ల నుంచి మేడారం జాతరకు బస్సులను నడిపేందుకు ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి కరీంనగర్, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, యైటింక్లయిన్కాలనీ, హుజూరాబాద్ బస్టాండ్ కేంద్రాలుగా ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రయాణికులు ఆర్టీసీ సేవల కోసం డిపో మేనేజర్లను ఇన్చార్జీలుగా నియమించారు. మొత్తం 530 బస్సులు తిరుగనుండగా వాటిలో 275 కరీంనగర్ రీజయన్ చెందినవి కాగా 255 హైదరాబాద్ రీజియన్ నుంచి రప్పించారు. ఆరు కేంద్రాల్లో ప్ర యాణికుల కోసం అన్ని వసతులను కల్పించారు. మంచినీరు, లైటింగ్, వైద్య శిబిరాలు, టాయిలెట్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రత్యేక సెంటర్లో టి కెట్ నేరుగా తీసుకునేందుకు కౌంటర్లను ఏర్పాటు చేశారు. మేడారం వెళ్లలేని భక్తు లు 450 చెల్లిస్తే తమ మొక్కులను (బంగార) ఐదు కిలోలవరకు నేరుగా అమ్మవార్ల గద్దెల వద్ద పూజరులకు అం దించనుంది. తిరిగి అమ్మవార్ల ప్రసాదం, కుంకుమలను బుకింగ్ కౌంటర్ల వద్ద అందించనున్నారు. తిరుగు ప్రయాణంలో మేడారం జాతరలో 62 కౌంటర్లు ఏర్పాటు చేశారు.
భారతీయ స్ఫూర్తి రత్న అవార్డుకు రాజన్న
ఓదెల, ఫిబ్రవరి 12: పొ త్కపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ దాసరి రా జన్న భారతీయ స్ఫూర్తి రత్న అవార్డుకు ఎంపికయ్యారు. కొంతకాలంగా ఆయుర్వేద వైద్య నిపుణుడిగా అందిస్తున్న సేవలకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మౌంట్ ఫౌం డేషన్, వంశీ టీవీ వారు ఆదివారం నిర్వహించే సర్వీస్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు విభాగంలో రాజ న్న ఆయుర్వేదంలో అవార్డు అందుకోనున్నా రు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, నాయకులు అభినందించారు.
మేడారం జాతర ఎక్సైజ్ శాఖ ప్రత్యేకాధికారిగా చంద్రశేఖర్
సిరిసిల్ల, ఫిబ్రవరి 12: మేడారం జాతరకు ఎక్సై జ్ శాఖ ప్రత్యేకాధికారిగా ఎల్లారెడ్డిపేట ఎక్సై జ్ సీఐ మరాఠి పీఆర్ చంద్రశేఖర్కు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. ఈ మేరకు ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ కమిషనర్ సురేశ్ రాథోడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ సీఐ చ్ంర దశేఖర్ ఈ నెల 11 నుంచి 16 వరకు మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరలో ఎక్సైజ్శాఖ పక్షాన ప్రత్యేకాధికారిగా పర్యవేక్షించనున్నారు. మేడారం జాతరలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేకాధికారిగా చంద్రశేఖర్ ఐదోసారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.